Tuesday, May 14, 2024

పదేళ్ల తెలంగాణ పాలనలో అభివృద్ది శూన్యం

తప్పక చదవండి
  • అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోని కేంద్రం
  • తనపై 24 కేసులు పెట్టి ఇల్లు కూడా లాగేసుకున్నారు
  • కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్న విషయం మారిచారా
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంఐఎంల కుమ్మక్కు రాజకీయాలు
  • అధికారంలోకి రాగేనే కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తాం
  • ఆందోల్‌, కామారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌

హైదరాబాద్ : తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి వూన్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కెసిఆర్‌ తెలంగాణను దోచుకోవడంలోనే ముందున్నారని మండిపడ్డారు. ఆదివారం రాహుల్‌ కామారెడ్డి, ఆందోల్లో పర్యటించి ప్రచారం నిర్వహిం చారు. తెలంగాణలో ఏం అభివృద్ది జరిగిందో చెప్పాలని, అలాగే అవినీతిపై సమాధానం ఇవ్వాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా అందోల్‌ లో నిర్వహించిన సభలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూలో ఎదురు చూస్తున్నారని, పేపర్ల లీక్‌తో వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్‌ కలిసి ప్రజల డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని, ఒకిరిక ఒకరు సహకరించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతు న్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలోనే 6 గ్యారెంటీలపై సంతకం పెట్టి అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. అలాగే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 వేస్తాం. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం.’ అని రాహుల్‌ వివరించారు. హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ లోని నిరుద్యోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని, రాష్ట్రంలో పేపర్‌ లీకేజీ వల్ల వారు ఎంతో నష్టపోయారని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే, అవి రద్దవడంతో వారి బాధలు వర్ణనాతీతమని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని బీఆర్‌ఎస్‌ అంటోందని, ’కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. మీరు ఏ స్కూల్‌ చదివారో ఆ స్కూల్‌ కట్టించింది కాంగ్రెస్‌ పార్టీ.’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ దోచుకున్న సొమ్మును రికవరీ చేసి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రితో ఆ నగదును పేదల అకౌంట్‌ లో వేస్తామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ ఒక్కటయ్యాయని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ’ల్యాండ్స్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రధాని మోడీ నాపై 24 కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్‌ నుంచి నన్ను పంపించేశారు. అవినీతిపరుడైన కేసీఆర్‌ పై మాత్రం ఒక్క కేసు కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రజలు ఆలోచించి హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మెక్కేసిన నిధులను కక్కిస్తామని పేర్కొన్నారు. నాణ్యత లేకపోవడంతో కాళేశ్వరం డ్యాం కుంగి పోయింది. హైదరాబాద్‌ను సాంకేతిక నగరంగా తీర్చిదిద్దాం. ప్రపంచంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చాము. కానీ వారు భూ ఆక్రమణలు, అక్రమాలతో హైదరాబాద్‌ను దోచుకున్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారు. కేసీఆర్‌ తిరుగుతున్న రోడ్లు, మీరు చదువుకున్న విద్యాసంస్థలు కాంగ్రెస్‌ కట్టినవే. మోడీ ఏమంటారో కేసీఆర్‌ అదే అంటారు. మోడీ తెచ్చే చట్టాలకు కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నాపై మోడీ ప్రభుత్వం 24 కేసులు పెట్టారు. నా ఇంటిని లాక్కున్నారు. కేసీఆర్‌ మీద ఎందుకు దాడులు చేయడం లేదు. విచారణలు ఎందుకు చేపట్టడం లేదో మోడీ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అమిత్‌ షాలు రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారు. బీజేపీ నేతల టైర్ల గాలి తీసేశాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ డ్రామాలో ఎంఐఎం చేరింది. ఎంఐఎం కేవలం మమ్మల్ని ఓడ గొట్టడానికే ఉంటుంది. మా ప్రభుత్వం రాగానే మేమిచ్చిన ఆరు గ్యారంటీలను చట్టలుగా మారుస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వంలో నెలకు 2000 బస్సు ఛార్జీలు ఖర్చు చేశారు. మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. తెలంగాణ అమరవీరులకు 250 గజాల స్థలం ఇస్తాం. యువతకు విద్యా భరోసా కార్డు ఇస్తాం. కార్డు ఉన్నవారికి పై చదువుల కోసం 5 లక్షలు ఇస్తాం.మీరు కలలుగన్న ప్రజా తెలంగాణ సాధిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్‌ అవినీతి, అహంకార సర్కార్‌ను గద్దెదించే అవకాశం మీ చేతుల్లో ఉందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు