Friday, May 3, 2024

మేడ్చల్ లో జర్నలిస్ట్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడి

తప్పక చదవండి
  • ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్న స్థానిక ప్రజలు

మేడ్చల్ : మేడ్చల్ లో అధికార పార్టీకి చెందిన నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతుంది. శనివారం షామీర్పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి ఘటన మరువకముందే మేడ్చల్ మండలలోని గౌడవెల్లి గ్రామంలో మరో విలేకరిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారు. ఆదివారం గౌడవెల్లి గ్రామంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేసేందుకు టోకెన్ లు ఇస్తుండగా అది చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి చేశారు. ఈ దాడిపై సదరు జర్నలిస్ట్ పోలీసులకు పిర్యాదు చేయనున్నాడు. నిజాయితీగా ప్రజా సేవ చేస్తాం అంటూ ఓటు అభ్యర్దిచాల్సిన అధికార పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లను కొనుగోలు చేస్తూ జర్నలిస్టుల పై దాడి చేయడం ఏంటని ప్రజకు ప్రజలు అధికార పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు