Sunday, May 5, 2024

డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాలనునిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాం..!

తప్పక చదవండి

– సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు..
– యువత డ్రగ్స్‌ వినియోగానికి దూరంగా ఉండాలి…
– రాచకొండ సీపీ : సుధీర్‌ బాబు!!

ఎల్బీనగర్‌ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ రవాణా సహించేది లేదని, వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్‌ సుధీర్‌ బాబు పేర్కొ న్నారు. సోమవారం బండ్లగూడలోని జిఎస్‌ఐ ఆడిటోరియంలో ఎన్డిపిఎస్‌ కేసుల ప్రొసీజరల్‌ ఎక్సలె న్స్‌ సెమినార్‌ జరిగింది. ఈసందర్భంగా వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్‌, పై స్థాయి అధికారులకు నిషేధిత డ్రగ్స్‌ కేసుల విచారణకు ఉపకరించే హ్యాండ్‌ బుక్‌ మాన్యువల్‌ అం దించారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిది అని, డ్రగ్స్‌ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ రవాణా, వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్‌ పోస్టుల వద్ద క్రమం తప్పకుండా చేస్తున్న తనిఖీలతో పాటు ప్రత్యేక ఎస్‌ఓటి బృందాలు ఏర్పాటు చేసి చేపడుతున్న ఆపరేషన్ల ద్వారా ఎన్నో గంజాయి, ఓపియం, హెరాయిన్‌ వంటి ఇతర నిషేధిత డ్రగ్స్‌ సరఫరా ముఠాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని, అవసరమైతే వారి పై పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.. తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన చెందారు. యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని హితవు పలికారు. మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడిరచారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించేలా కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ డి.జానకి, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్‌, ఎస్‌ఓటి డీసీపీ గిరిధర్‌, ఎల్బీ నగర్‌ డీసీపీ సాయి శ్రీ, ఎస్‌ఓటి డీసీపీ మురళీధర్‌ ఇతర ఇన్స్పెక్టర్‌ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు