Sunday, April 28, 2024

అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..

తప్పక చదవండి

గత నెలలో ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోరా అని ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సీతాఫల్‌ మండి డివిజన్‌ లోని శ్రీనివాస నగర్‌ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. సర్కిల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్‌ ప్లానింగ్‌ ఏసిపి రజిత తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని చేపడితే చర్యలు తప్పవని ఏసిపి రజిత హెచ్చరించారు. కూల్చివేతలలో సెక్షన్‌ ఆఫీసర్‌ సరిత, న్యాక్‌ ఇంజినీర్‌ ప్రకాష్‌, చైన్‌ మెన్‌ ఆంజనేయులు, చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు