Sunday, May 12, 2024

తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!

తప్పక చదవండి
  • తమ పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ బీజేపీ నేత రవి కుమార్ యాదవ్..
  • అప్పట్లో కేసు నమోదు అయినా అధికారుల బదిలీతో తెర మరుగు..
  • కేసులో లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితులు..
  • ఇప్పుడు ఈ కేసు తెరమీదకు రావడంతో సర్వత్రా తీవ్ర చర్చ..

ఒక పార్టీవారు మరో పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులులకు తెగబడటం చూస్తూ ఉంటాం.. కానీ ఒకే పార్టీకి చెందిన తన సహచరుడిపై హత్యాయత్నం చేయడం దారుణం.. వ్యక్తిగత కక్షలు ఉండవచ్చు.. అలాంటి సమస్యలను పార్టీ పెద్దల ముందు ఉంచి పరిష్కారానికి ప్రయత్నం చేస్తే సమసిపోతాయి.. కానీ దాడులకు, హత్యాయత్నాలకు దిగితే పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది.. ఇలాంటి ఘటనే ఈ ఏడాది 16నాడు శేరిలింగం పల్లిలో చోటు చేసుకుంది.. బీజేపీ పార్టీకి చెందిన నేత రవి కుమార్ యాదవ్ తమ పార్టీకే చెందిన నేత గజ్జెల యోగానంద్ పై హత్యాయత్నం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. నిందితుడిపై కేసు కూడా నమోదు అయ్యింది.. కాల గమనంలో ఆకేసు మరుగునపడిపోయింది.. కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆ వ్యవహారం తిరిగి వెలుగు చూడటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది..

హైదరాబాద్ : శేరిలింగం పల్లి బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ పై నమోదైన హత్యాయత్నం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో పురోగతి గురించి వెల్లడించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి ఈ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

ఈ ఏడాది జూన్ 16న శేరిలింగంపల్లి మండలంలోని, మజీద్ బండలో బీజేపీ నేత గజ్జెల యోగానంద్ ‘మీ సమస్య- మా పోరాటం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలామంది బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మజీద్ బండకు వెళ్లారు. అక్కడ వార్డు కార్యాలయం వద్దకు వెళ్లిన తమపై.. రవి యాదవ్ వర్గీయులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తమ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రవి యాదవ్ పై మండిపడ్డారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రవి యాదవ్ తో పాటు, మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి అధికారుల బదిలీలు జరిగాయి. దీంతో ఆ కేసు అటకెక్కేసింది.. కాగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు నాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా గతంలో కేసులు పెట్టిన వారిని.. నేరారోపణ ఎదుర్కొంటున్న బీజేపీ నేత రవి యాదవ్ తన అనుచరులతో అక్రమ కేసులు పెట్టిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు