Monday, April 29, 2024

ఢిల్లీకి టీమిండియా..?

తప్పక చదవండి
  • భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరం

చెన్నై: వన్‌ డే ప్రపంచకప్‌లో భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ కోసం టిమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో ఆ మ్యాచ్‌ గిల్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ తలపడబోతోంది. అయితే, శుభ్‌మాన్‌ గిల్‌కు జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు కూడా అతడిని దూరం పెడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా ఇవాళ చెన్నై నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. కానీ, గిల్‌ మాత్రం జ్వరం కారణంగా చెన్నైలోనే ఉండిపోయాడు. బీసీసీఐకి చెందిన మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఆయన ఉన్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు