- మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను
- జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
- 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు
- 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్
- నారా లోకేశ్, బాలకృష్ణ, బ్రాహ్మణి, దేవాన్షుల రాక
- జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు
- భావోద్వేగాలకు లోనైన పార్టీ అధినేత బాబు
- మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు
- జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. చేయబోను
- అభిమానం చాటిన వారందరికీ రుణపడి ఉంటా
- జైలువద్ద చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కొంచెం బలహీనంగా కనిపించిన చంద్రబాబు దగ్గుతూనే మాట్లాడారు. 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేయటంతో.. చంద్రబాబు విడుదలయ్యారు. లాంఛనాలు పూర్తి కావడంతో నాలుగు గంటల సమయంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కాన్వాయ్ ఉండవల్లి నుంచి రాజమండ్రికి వచ్చింది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ మొత్తం జైలు వద్దకు వచ్చింది. చంద్రబాబు కుటుంబసభ్యులు అందరూ జైలు వద్దకు వచ్చారు. నారా లోకేష్, బాలకృష్ణ కూడా వచ్చారు. పెద్ద ఎత్తున జనం రావడంతో.. వారిని అదుపు చేసేందుకు కిలోమీటర్ ముందే పోలీసులు బారీకేడ్లను పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలు తోసేసుకుని వెళ్లిపోయారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో యాభై రోజుల పాటు ఎప్పుడూ బయట కనిపించకుండా ఉండలేదు. ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. చంద్రబాబు ర్యాలీచేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి ర్యాలీలు చేయడం లేదని టీడీపీ స్పష్టం చేసింది. 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. తన మనుమడు దేవాన్ష్ను ఎమోషనల్గా గుండెలకు హత్తుకుని ముద్దాడారు. అనంతరం.. పార్టీ సీనియర్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు తన అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించిన మాట్లాడారు. తాను కష్టంలో ఉన్నప్పుడు తనకు మద్దతుగా, సంఫీుభావం ప్రకటించిన కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పేరు పేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడినంటూ చెప్పుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తన మీద ప్రజలు చూపించిన అభిమానంతో తన జీవితం ధన్యమైందని చంద్రబాబు తెలిపారు. ‘‘నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు మీరంతా తోడుగా ఉన్నారు. ఎక్కడికక్కడా నా ఆరోగ్యం బాగుండాలని పూజలు, ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా నాకు అండగా ఉన్నారు. నాకోసం ఎక్కడిక్కడా రోడ్డు మీదికొచ్చి సంఫీుభావం ప్రకటించారు. మీ అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన విధానాల వల్ల ఏదో రకంగా లబ్ది పొందిన వాళ్లంతా.. రోడ్డు మీదికొచ్చి సంఫీుభావం వ్యక్తం చేశారు. వాళ్లందికీ నా ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా సంఫీుభావం వ్యక్తం చేయటం, నా మీద వారికున్న అభిమానాన్ని చూపించటంతో నా జీవితం ధన్యమైంది.’’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఎక్కడా తప్పు చేయలేదని.. చేయనని.. చేయబోననంటూ.. చంద్రబాబు స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం ఏంటో తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. అభిమానులే కాదు.. రాజకీయ పార్టీలు కూడా తనకు సంఫీుభావం తెలిజేశాయన్న చంద్రబాబు వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలను కూడా చంద్రబాబు ప్రస్తవించి అభినందించారు చంద్రబాబు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు సంఫీు భావం వ్యక్తం చేయటం అభినందనీయమని.. హైటెక్ సిటీ నిర్మించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంతో యువత అంతా కలిసి తనకు మద్దతు ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు.