Tuesday, May 7, 2024

‘‘గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు’’

తప్పక చదవండి
  • మామూళ్ల మత్తులో అధికారులు..

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు మద్యంను విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధం గా మద్యం విక్రయాలుపల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కిరాణాదుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాలు, పాన్‌ షాపులు, కల్లు కాంపౌండ్‌ల సమీ పంలో మద్యం ఏరులై పారు తోంది. భవననిర్మా ణ కార్మికులు, కూలీలు, హోటల్‌లు, ఇసుక రవాణా కార్మికుల కు తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు క్వార్టర్లు, ఆరు ఆఫ్‌లుగా సాగిస్తున్నారు. గతంలో వైన్‌ షాపుల పరిసరాలలో కొనసాగిన ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మ ద్యం ప్రియులు ఉదయం టీ, కాఫీల కు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉదయం పూట వా హనాలలో తీసుకువచ్చి, ఆ ప్రాంతంలోనే ఓ కల్లు కాంపౌండ్‌ పరిసరాలలో పలువురు పాన్‌షాపులు ఏర్పాటు చేసి అందులో బెల్టుదుకాణం నడిపిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెతి చూడడం లేదనే విమ ర్శలు ఉన్నాయి.గుడుంబా విక్రయాలు మానేసిన వారికి ప్రభుత్వం ఓవై పు స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మ రో వైపు బెల్టు దుకాణాలు పల్లెలు, పట్టణ ప్రజలను మత్తులో ముంచుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తు న్నాయి.లిక్కర్‌ డాన్లు వివిద జిల్లాల్లో కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఆ మద్యం తాగిన వ్యక్తులు వాటికి బానిసలై తమ ఆరోగ్యాలను పాడుచేసు కుంటున్నారు.ఒకప్పుడు నగరాలు ,పట్టణ ప్రాంతాలకే పరిమిత మైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగు తోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటి స్తుంటే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టుదుకా ణాలు కొనసాగుతున్నాయి. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్టుదుకాణాలు జోరందు కున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలోనే మద్యం షాపులు కొనసాగు తున్నాయి. వివిధ మండలంలలోని కొన్ని గ్రామంలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది.అందులో బాటిళ్లను ఎంఆర్‌పీ కంటే రూ.40 నుంచి రూ.100 వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు.. కొందరైతే వాహనాల ను ఉదయం సమయంలో తీసుకువచ్చి అడ్డకూలీలకు, ఇసు క ట్రాక్టర్ల మీద వెళ్లే కూలీలకు అమ్మకాలు జరుపుతున్నారు.వివిధ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్ల వద్ద గల కిరాణా దుకాణాల లో కల్తీమద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని తెలు స్తోంది. అన్నిజిల్లాలలో ఈ దందా సంగతి తెలిసిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొం దరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టు షాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉ న్నతాధికారులు దృష్టిసారిస్తేనే ఈ బెల్టుదందాకు అడ్డుకట్టప డడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వార వుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. యువత మాత్రం నిత్యం వీనికి బానిస ఆయి ఒళ్లు గుళ్ల చేసుకుని భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారు.ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటూంది.ఇకనయినా నూతన ప్రభుత్వం ,సంబం ధిత అధికారులు దృష్టి సారించాలి. బెల్ట్‌ షాప్‌ నిర్వాహకుల మీద ఉక్కు పాదం మోపాలి.బెల్ట్‌ షాపులను పూర్తిగా రద్దు చేయాలి.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134
“““`

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు