Thursday, May 9, 2024

వెంకట స్వామిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళతాం..

తప్పక చదవండి
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
  • ట్యాంక్ బ్యాండ్ పై కాకా విగ్రహానికి నివాళులు..
  • పాల్గొన్న బండి, వివేక్ వెంకట స్వామి, లక్ష్మణ్..

హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) గారి 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి వెంకటస్వామి.. అనేక కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా. హైదరాబాద్ లోని వందలాది బస్తీలతో ఆయన జీవితం పెనవేసుకుంది. పేద ప్రజలకు ఇండ్ల కోసం స్థల సౌకర్యం కల్పించిన మహనీయుడు. ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారు. దేశంలోనే అత్యున్నత స్థానంలో సేవలు అందించిన వెంకటస్వామిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్దాం అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు