Monday, April 29, 2024

ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా..

తప్పక చదవండి

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకులు.. ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు ఆ రెండు బ్యాంకులపై భారీగా రూ.16.14 కోట్ల పెనాల్టీ విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల ఫైన్‌ వేసింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్‌ 20, సబ్‌ సెక్షన్‌ (1), సెక్షన్‌ 6లోని సబ్‌ సెక్షన్‌ (2), సెక్షన్‌ 8 ప్రకారం రుణాల అడ్వాన్స్‌లు, ఇతర చట్టబద్ధమైన నిబంధనల అమలులో ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైందని ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్లలో ఇద్దరికి గల కంపెనీలకు రుణాలు మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించింని ఆర్బీఐ పేర్కొంది. ‘బ్యాంకులకు ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసులు అందిస్తున్న సంస్థల ప్రవర్తనా నియామవళి, ఇబ్బందులపై’ ఆర్బీఐ మార్గదర్శకాలను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పట్టించుకోలేదని సెంట్రల్‌ బ్యాంక్‌ వ్యాఖ్యానించింది. తమ సర్వీస్‌ ప్రొవైడర్‌ పనితీరుపై వార్షిక సమీక్ష నిర్వహించడంలోనూ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైందని తెలిపింది. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ కోటక్‌ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విపలమైందని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు