Tuesday, May 7, 2024

మేడిగడ్డకు మంత్రులు

తప్పక చదవండి
  • హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరనున్న మంత్రులు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • పాల్గొన్న అన్ని సంస్థలూ హాజరయ్యేలా ఆదేశాలు
  • 1.20 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్​
  • రాఫ్ట్ ఫౌండేషన్​ను పరీక్షిస్తేనే స్పష్టత
  • ఇసుక తొలగింపు పర్మిషన్ ​కోసం మహారాష్ట్ర సర్కారుకు లేఖ
  • ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ
  • ‘మేడిగడ్డ’ పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు కలిసి శుక్రవారం 29న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి మంత్రులు మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ, నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్‌ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో
సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు.

1.20 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్​
గోదావరి నదిపై 1.62 కి.మీ.ల పొడవైన మేడిగడ్డ బ్యారేజీని ఎనిమిది బ్లాకులుగా నిర్మించారు. దానికి 85 వరద గేట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వైపునకు ఉన్న మూడు బ్లాకుల్లో 36 గేట్లున్నాయి. ఈ ఏడాది అక్టోబర్​21న సాయంత్రం బ్యారేజీ ఏడో బ్లాక్​లోని 20వ పిల్లర్​ భారీ శబ్దంతో కుంగిపోయింది. తర్వాత అదే పిల్లర్​ రెండు సార్లు కుంగింది. మొత్తంగా 1.20 మీటర్ల లోతుకు 20వ పిల్లర్​కుంగినట్టుగా గుర్తించారు. నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బ్యారేజీని సందర్శించి రాష్ట్ర ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​ఇచ్చిన పలు డాక్యుమెంట్ల ఆధారంగా కుంగుబాటుకు కారణాలను గుర్తించింది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్​చేస్తే తప్ప బ్యారేజీ ఎందుకు కుంగిందో గుర్తించలేమని, ఆ ఇన్వెస్టిగేషన్​లో తమనూ భాగస్వాములను చేయాలని కొన్ని రోజుల క్రితం స్టేట్​డ్యామ్​సేఫ్టీ ఆర్గనైజేషన్​కు లేఖ రాసింది. ఆ తర్వాత బ్యారేజీ కుంగడానికి కారణాలు అన్వేషించే పని మొదలు పెట్టారు. ఇసుక తీసిన తర్వాత బ్యారేజీ ఫౌండేషన్​ను పరిశీలించి దానికి దిగువన పరిస్థితి ఏమిటో తేల్చాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇసుకపై కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. రాఫ్ట్ కు కింద నదిలోపల తవ్వి పిల్లర్ల కోసం ఫౌండేషన్ వేశారు. వరద ఉధృతికి పిల్లర్లు కదలకుండా రాఫ్ట్ ఫౌండేషన్ తో బలంగా ఉండేలా చేశారు. ఏడో బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిన తర్వాత దానికి ఇరు వైపులా ఉన్న ఆరు, ఎనిమిది బ్లాకుల్లో గల పిల్లర్లకూ డ్యామేజ్ అయినట్టు ఫీల్డ్ ఇంజినీర్లు గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఇసుకను తీస్తేనే లోపాలు బహిర్గతం
బ్యారేజీలో ఏడో బ్లాక్​ను పునరుద్ధరించాలంటే.. పిల్లర్లను తొలగించడానికి బలమైన రాఫ్ట్ ఫౌండేషన్ ను కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసేప్పుడు కూడా ఆరు, ఎనిమిదో బ్లాక్ లోని పిల్లర్లపై ప్రభావం పడుతుందని అనుమానిస్తున్నారు. ఇసుకను తీస్తే రాఫ్ట్ ఫౌండేషన్ లో ఏమైనా లోపాలు ఉన్నా బయటపడుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. మొదట్లో డ్యామేజీలు ఏడో బ్లాక్ కే పరిమితమయ్యాయని అనుకున్నామని, కానీ పరిస్థితి చూస్తుంటే నష్టం భారీగానే ఉంటుందని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడైనా హడావుడి రిపేర్లతో మమ అనిపించకుండా.. బ్యారేజీలో లోపాలపై సమగ్రమైన సర్వే చేయాలని, ఆ తర్వాతే రిపేర్లపై దృష్టి పెట్టాలని ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ లోనే చర్చ సాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు