Friday, May 3, 2024

‘లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌’

తప్పక చదవండి
  • చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపు
  • లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌ పేరుతో నిరసన
  • హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
  • చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా కార్యక్రమం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ‌షర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ పేరుతో కార్యక్రమం తలపెట్టారు.

శనివారం ఉదయం 10.30 – 11.30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు అభిమానులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

- Advertisement -

దీంతో చంద్రబాబు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రవేశాల వద్ద బందోబస్తు నిర్వహిస్తూ బ్లాక్ టీ షర్టులు ధరించిన వారిని లోనికి అనుమతించడం లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో.. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసివేశారు.

ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ – మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వస్తున్నారు. నల్ల టీషర్టులు ధరించి పైనుంచి మరో చొక్కా వేసుకుంటున్నారు. మెట్రో ఎక్కిన తర్వాత పైనున్న చొక్కా తీసేస్తు్న్నారు. ఇలా పోలీసులు, మెట్రో సిబ్బంది కళ్లుగప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మద్దతుదారుల నిరసనతో మెట్రోకు ఆదాయం పెరిగింది. భారీగా ఆయన అభిమానులు మెట్రోలో ప్రయాణిస్తుండటంతో రోజూవారీ కంటే రద్దీ ఎక్కువగా ఉండి అదనపు ఆదాయం వస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు