Monday, April 29, 2024

సిద్దవరం యానాదయ్యకు ఆత్మీయ సన్మానం..

తప్పక చదవండి

అమరావతి : విజయవాడలో సోమవారం రోజు ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడుగా నియమితులైన సిద్దవరం యానదయ్యని ఆత్మీయ సన్మానం చేసిన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలోని కళ్యాణకట్టలలో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణులను, దేవుడికి సొన్నాయి వాయిద్యాలతో సేవచేస్తున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించే దేవాలయాల పాలకమండలిలకు వేసే కమిటీలలో విదిగా ఒక నాయీబ్రాహ్మణ ఉండే విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినట్లు తెలంగాణలో కూడ నాయీబ్రాహ్మణులకు నామినేట్ పదవులలో నాయీబ్రాహ్మణులకు అవకాశాలు కల్పించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు వివిధ రంగాలలో ఉన్న నాయీబ్రాహ్మణ మేధావులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు