Tuesday, May 14, 2024

మునుగోడు బరిలో సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా కె.వి గౌడ్

తప్పక చదవండి

మునుగోడు : తెలంగాణ శాసనసభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుండి సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కె వి గౌడ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి దామోదర్ రావు కు అందజేశారు. గత దశాబ్ద కాలంగా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాటం చేస్తున్న కె.వి గౌడ్ ను ఆశీర్వదించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు కేవలం అగ్రకుల పాలకులేలు ఎమ్మెల్యేలు చేస్తున్నందున బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ రంగంలోనూ ఎదగలేదు. నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీసీలను అణిచివేస్తున్నాయి. బీసీలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కొరకై గత 77 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నప్పటికీ వారి యొక్క డిమాండ్లను పట్టించుకోకుండా ఈడబ్ల్యూఎస్ మహిళా బిల్లుల రూపంలో బీసీలను అణచివేసేటువంటి కుట్రపూరితంగా చట్టాలు చేసి అమలు చేస్తున్నాయి. ఈ చట్టాలకు పైన పేర్కొన్న అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి అంటే ఈ పార్టీలన్నీ పేర్లు మాత్రమే వేరు కానీ వీటి యొక్క ఆలోచన ఒకటేనని విషయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ప్రజానీకం అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు