కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలకు కట్టదుట్టమైన బందోబస్తు కల్పిస్తూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొండమల్లేపల్లి మండలం పరిధిలో పలు గ్రామాలలో హింసాత్మకమైన గ్రామాలను సందర్శించిన కొండమల్లేపల్లి సీఐ,ఎస్ఐ. పూర్తి వివరాల్లోకి వెళితే కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న గుమ్మడవెల్లి గుడి తండా చింత చెట్టు తండా ఘాజీ నగర్ లో కొండమల్లేపల్లి సిఐ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి ఎస్సై సిబ్బంది,ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఫోర్స్ సిబ్బందితో కలిసి అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ప్రజలకు పోలీసులపై వ్యవస్థపై భరోసా కల్పించడం కోసం ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.