Wednesday, May 1, 2024

రిటైర్మెంట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో భారతీయులు విశ్రాంతి జీవనం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకు తగిన విధంగా రిటైర్మెంట్‌ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో దీనికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, పీజీఐఎం ఇడియా నిర్వహించిన ‘రిటైర్మెంట్‌ రెడీనెస్‌ సర్వే, 2023’ పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది తాము రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగి ఉన్నట్టు చెప్పడం గమనార్హం. 2020లో నిర్వహించిన సర్వేలో వ్యక్తుల ఆర్థిక ప్రాధాన్యతల్లో రిటైర్మెంట్‌ కు 8వ స్థానం ఉంటే , అది ఈ ఏడా ది సర్వేలో 6వ స్థానానికి చేరుకుంది. రిటైర్మెట్‌ అనేది కుటుంబ బాధ్యతల్లో భాగమని గతంలో భా వించేవారు. కానీ, కొన్నేళ్ల కాలంలో దీనికి నిర్వచనంలో మార్పు వచ్చింది. వ్యక్తిగత సరక్షణ, స్వీ య గుర్తింపునకు రిటైర్మెంట్‌ను కీలకంగా ఇప్పుడు ఎక్కువ మంది భావిస్తున్నారు. తమ కోరికల వి షయంలో రాజీ పడకుండా ఆర్థిక అంశాలపై నియంత్రణను కోకుంటున్నారు. ‘కరోనా మహమ్మారి కొన్ని ముఖ్యమైన అశాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. స్వీయ గుర్తింపు, స్వీయ సంరక్షణ, స్వీయ విలువ అనేవి కుటుంబ బాధ్యతల నిర్వహణతోపాటు వ్యక్తుల ప్రాధాన్య అంశాలుగా అవత రించాయి‘అని పీజీఐఎం మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో అజిత్‌ విూనన్‌ పేర్కొన్నారు.సర్వేలోని అంశా లు రూ. 20`50వేల మధ్య ఆదాయం కలిగిన వారిలో, రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారు 2020లో 49 శాతంగా ఉంటే.. 2023 సర్వే నాటికి 67 శాతానికి పెరిగారు. రిటైర్మెంట్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 నాటికి రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారిలో 14 శాతం మందే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, తాజాగా అది 24 శాతానికి పె రిగింది. పదవీ విరమణ తర్వాత జీవనానికి పెద్ద మొత్తంలో నిధి అవసరమని ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 2020లో సగటున రూ.50 లక్షలకు ప్రణాళిక రూపొందించుకుంటుంటే, అది రూ. 73.44 లక్షలకు పెరిగింది. కరోనా మహమ్మారి మిగిల్చిన జ్ఞాపకాల నేపథ్యంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తూ, ఆర్థిక భద్రత కల్పించుకోవాల్సిన అవసరాన్ని మూడిరట రెండొంతుల మంది గుర్తిస్తున్నా రు. ఆర్థిక ప్రణాళిక కలిగిన వారిలో 50 శాతం మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక మదగమనం ఏర్ప డితే ఎలా అన్న ఆందోళనతో ఉన్నారు. రిటైర్మెంట్‌ తర్వాత ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, జీనవ వ్య యం ఆందోళన కలిగించే ఇతర అంశాలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం గురించి 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు