Thursday, May 2, 2024

రూ. 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం

తప్పక చదవండి
  • ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మెన్‌ ముకేశ్‌ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ`మెయిల్‌ ద్వారా ఓ వ్యక్తి బెదిరించాడు. తమకు 20 కోట్లు ఇవ్వకుంటే, చంపేస్తామని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. తమ వద్ద బెస్ట్‌ షూటర్స్‌ కూడా ఉన్నట్లు ఆ మెయిల్‌లో తెలిపారు. షాదాబాద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న మెయిల్‌ నుంచి అక్టోబర్‌ 27వ తేదీన బెదిరింపు వచ్చింది. ఆంటిలియాలోని అంబానీ నివాసానికి చెందిన సెక్యూర్టీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. ముంబైలోని గామ్‌దేవి పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. ఐపీసీ 387, 502(2) సెక్షన్ల కింద కేసును బుక్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు