Friday, May 17, 2024

ఇంట్లోకి చోరబడి మహిళ దారుణ హత్య

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. కాల్పుల శబ్దం విన్న పొరుగువారు ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్‌ వదిలి పారిపోయారు. దేశ రాజధాని ఢల్లీిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జైత్‌పూర్‌ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి ముసుగులు ధరించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆ ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. కాగా, కాల్పుల శబ్దం విన్న పొరుగువారు వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. బైక్‌పై పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారు బైక్‌ను వదిలి పరుగులు తీసి తప్పించుకున్నారు. కాల్పుల్లో గాయపడిన పూజా యాదవ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులకు చెందిన నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకున్నారు. పూజాను వారు ఎందుకు కాల్చి చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు