Monday, May 6, 2024

అవకాశం ఇస్తే ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

తప్పక చదవండి

ఖమ్మం: కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా బుధవారం తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమ కారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలతోపాటు ఉద్యమ కారులు డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ కేవీ కృష్ణారావు, ఎర్నేని రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమ కారులు తనకు సంఫీుభావంగా నిలవడం విూ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించానని, గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా శస్య శ్యామలం చేయడం కోసమే నాడు టీఆర్‌ఎస్‌ లో చేరానని, మోసకారి నాటకాల స్వార్ధ పూరిత కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరి నచ్చకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఉద్యమ కారులకు ఇంటి స్థలాల వాగ్దానం ఆరు గ్యారంటీ పథకాల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం ఉధ్యమ కారులు కథం తొక్కడం సంతోషమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు