Thursday, May 16, 2024

ఎంతో అభివృద్ధి చేశా.. మరోసారి నన్ను ఆశీర్వదించండి

తప్పక చదవండి
  • ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

రాంగోపాల్‌ పేట్‌ : ఎన్నికల ప్రచా రంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని సనత్‌ నగర్‌ నియోజ కవర్గం బి.ఆర్‌.ఎస్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వాటర్స్‌ లో మీడియాతో మాట్లాడారు.సనత్‌ నగర్‌ నియోజకవర్గంను తాను ఎంతో అభివృద్ధి చేశానని….మరింత అభివృద్ధి జరగాలంటే మళ్ళీ తనకు ఓటు వేసి గెలిపించాలని నియోజక వర్గ ప్రజలను కోరారు.మతాలకు,కులాలకు అతీతంగా ప్రజలు బీఆర్‌ ఎస్‌ వైపే ఉన్నారన్నారు.అత్యదిక మెజారిటీతో విజయం సాధిస్తానని తలసాని ధీమా వ్యక్తం చేశారు. నేడు (మంగళవారం) ప్రచారంలో భాగంగా భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. బన్సీ లాల్‌పెట్‌ డివిజన్‌ నుండి పద్మారావు నగర్‌, ఐడియచ్‌ కాలనీ, మోం డా మార్కెట్‌, మహంకాళి స్ట్రీట్‌, కలసిగూడ,రాణిగంజ్‌, పాటిగడ్డ, బేగంపేట్‌, ఎంబీపీనగర్‌,ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తి, ఎస్సార్‌ నగర్‌, అమీర్పేట్‌, బల్కం పేట్‌, సనత్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి వెల్లడి చారు. రాష్ట్రవ్యాప్తంగా బి.ఆర్‌.ఎస్‌ పార్టీకి 70 నుంచి 85 సీట్ల వరకు గెలుస్తా మని మంత్రి తలసాని భీమా వ్యక్తం చేశారు. తాను కూడా నియోజక వర్గంలో బంపర్‌ మెజారిటీతో విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు