Thursday, May 16, 2024

మలక్ పేట బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న హిందూ, దళిత సంఘాలు

తప్పక చదవండి
  • హిందుత్వం ముసుగులో హిందువులపై దాడులు
  • కాషాయం కప్పుకున్న కరుడుగట్టిన ముస్లింవాది
  • బీజేపీ అంటే అభిమానం అభ్యర్థి అంటే అసహ్యం
  • సంరెడ్డి కాదు హిందువుల సంహరించే రెడ్డి ఓటేయకపోవడానికి కారణాలు ఎన్నో మలక్ పేటలో అరాచకాలు ఎన్నో

హైదరాబాద్ : మలక్ పేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సం రెడ్డి సురేందర్ రెడ్డి హిందుత్వం మూసుగులో ఉన్న ఒక హిందూ ద్రోహి అని హిందువుల పైనే దాడులకు తెగబడే ఇలాంటి వ్యక్తి కి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం దగ్గర హిందువుగా నటించి వాళ్లని ఏమార్చి టికెట్టు దక్కించుకున్న అతను హిందూ ప్రజలకు విరోధి నియోజకవర్గ వ్యాప్తంగా హిందువులు అతనికి సహకరించరని ఎందుకంటే అతని అరాచకాలు అన్ని ఇన్ని కావు ఆయన హిందూ ద్రోహి అంటూ ప్రచారం చేస్తున్నారు.

కాషాయం కప్పుకున్న కరుడుగట్టిన ముస్లిం వాది

- Advertisement -

సంరెడ్డి సురేందర్ రెడ్డి కాషాయ రంగు కప్పుకున్న కఠినాత్ముడు. మలక్ పేట నియోజకవర్గంలో ముస్లింలతో కలిసి ఎన్నో అరాచకాలు చేసిన ఆయనను ప్రజలు ఎవ్వరు నమ్మరని, అతనొక దుర్మార్గుడని స్థానికంగా ఉన్న ముస్లిం నాయకులతో కలిసి నియోజకవర్గంలో ఎన్నో భూదందాలకు తెరలేపాడని, కబ్జాలు, అరాచకాలు, చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అధికారం వస్తే ఇంకా పేట్రేగిపోతాడని ఆయన అరాచకాలకు అంతే ఉండదని అంటున్నారు. నియోజకవర్గంలో హిందువులకు సమస్యలు తలెత్తితే వాటిపై స్పందించకుండా ముస్లింల కొమ్ము కాసే వ్యక్తి వారి మేలు కోరే వ్యక్తిని మలక్ పేట నుండి తరిమికొడతామని అక్కడి ప్రజలు అంటున్నారు.

బీజేపీ అంటే అభిమానం అభ్యర్థి అంటే అసహ్యం

బీజేపీ అంటే అభిమానం ఉన్న మలక్ పేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అంటే అసహ్యమేస్తుంది అంటూ హిందూ సంఘాలు దళిత సంఘాలు మీడియా ముఖంగా అతనిపై ఉన్న అసహ్యాన్ని వెళ్ళగక్కారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న సంరెడ్డి ని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నట్లు వారు అంటున్నారు. బీజేపీ అధిష్టానం కూడా వ్యక్తుల గత చరిత్రను తెలుసుకొని టికెట్లు ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మాకు అభిమానం ఉన్నప్పటికిని ద్రోహి అయిన అభ్యర్థికి ఓటెలా వేయాలని ప్రశ్నిస్తున్నారు.

సంరెడ్డి కాదు హిందువులను సహారించేరెడ్డి..! ఓటేయకపోవడానికి కారణాలు ఎన్నో

సంరెడ్డి సురేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల పాలిట సంరెడ్డి కాదని వారిని సంహరించే రెడ్డి అని అంటున్నారు. ఆయనకు ఓటేయకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో ఆయన భూలక్ష్మి మాత దేవాలయం నిర్మాణ సమయంలో అక్కడ వాచ్ మెన్ గా ఉన్న దళిత బిడ్డను అవమానపరిచి దూషించాడని. అదే కాకుండా దేవాలయ భూములను కూడా వదలకుండా కబ్జా చేయడం ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి వేధించడం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ఎంఐఎం నాయకుల అండదండలతో కబ్జాలు చేయడం జరిగింది. సైదాబాద్ ప్రాంతంలో ఎంతోమంది హిందువులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ అవమానపరుస్తూ వేధిస్తున్న నాయకుడికా మేము ఓటు వేసేది అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ఆయనపై తిరుగుబాటుకు దిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మూలకు వెళ్లిన ఆయన అరాచకాలను కథలు కథలుగా చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మలక్పేటలో ఓడగొట్టి తీరాలని నిర్ణయం తీసుకున్నట్లు మలక్ పేట ప్రజలు మీడియా ముఖంగా తెలిపారు. అంతే కాకుండా నియోజకవర్గంలో ని హిందూ సంఘాలు కరపత్రాలను ప్రచురించి వాడ వాడ ఇల్లు ఇల్లు పంచుతూ ఆయన అరాచకాలను ఎండగడుతూ సంరెడ్డికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు