న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలోని పార్క్వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలోని హుండీ చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు వచ్చేటప్పటికి వారిలో ఇద్దరు గుడిలోనే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనను ఉత్తర అమెరికా హిందువుల సమాఖ్య ఖండించింది .