Monday, May 6, 2024

ఇదిగో నీ అఫిడవిట్‌.

తప్పక చదవండి
  • నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది.
  • మరి ఇప్పుడేమంటావ్‌ : బీజేపీ నేత బండి సంజయ్‌

కరీంనగర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ధరణి పోర్టల్‌పై మాట్లాడుతూ ‘‘ధరణి తప్పుల తడకని నువ్వే చెప్పుకున్నవ్‌ కదా. కేసీఆర్‌….ఇదిగో నీ అఫిడవిట్‌. నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది. మరి ఇప్పుడేమంటావ్‌.. నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా. ధరణి పోర్టల్‌ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తావా’’ అని ప్రశ్నించారు. తానతే సీఎం అవుతానని చెప్పనని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు పార్టీ అధిష్టానమే సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుందని.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం కావడం తథ్యం అని స్పష్టం చేశారు. హైకమాండ్‌ ఇదే విషయాన్ని ప్రకటించిందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఇమేజ్‌ లేనేలేదన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టేది బీజేపీయే అని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ డబ్బు సంచులు పంపుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు