Sunday, April 28, 2024

శ్రీలంకలో ‘గ్రీన్‌ చాలెంజ్‌’ను డెవలప్ చేస్తా..

తప్పక చదవండి
  • పేర్కొన్న బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని..

తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఆదివా రం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని పేర్కొన్నారు. శ్రీలంకలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇవాళ టూరిజం పెరిగి లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ అనే కార్యక్రమం ప్రారంభించడం, ఉద్యమంలా ముందుకు తీసుకుపోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రపంచలోని అనేక దేశాల్లో పర్యటించానని, అనేక మంది పర్యావరణవేత్తలను కలిశానని, కానీ, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లాంటి వినూత్న కార్యక్రమాన్ని ఎక్కడా చూడలేదని స్పష్టం చేశారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాడి మొక్కలు నాటిస్తున్న ఎంపీ సంతోష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు