Thursday, May 16, 2024

ఒక్కసారి అవకాశం ఇవ్వండిమీ నమ్మకాన్ని వోమ్ము చేయను

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి

మల్కాజిగిరి : బిఆర్‌ఎస్‌ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి నియోజకవర్గం పరిదిలో 141 గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్‌ మేకల సునీత రాము యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్‌ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మల్కాజ్గిరి బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మరియు రాజశేఖర్‌ రెడ్డి హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలను ఆప్యాయతలను చూసి చాలా ఆనందంగా ఉంది అని అన్నారు, రాబోయే ఎలక్షన్స్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మల్కాజ్గిరి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు.కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జీ శంభిపుర్‌ రాజు, ఏంబిసి కార్పోరేషన్‌ చైర్మన్‌ నందికంటీ శ్రీధర్‌, సర్కిల్‌ ఎన్నికల ఇంఛార్జి జితేందర్‌ రెడ్డి ,జేఏసి వెంకన్న తదితరలున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు