Sunday, May 19, 2024

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు: కర్ణాటక రైతులు

తప్పక చదవండి

బోధన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని కర్ణాటక రైతులు సూచించారు. మంగళవారం బోధన్‌ పట్టణానికి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. మేము కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి మోసపోయామని ఎన్నికల్లో 1200 ఉన్న పెన్షన్‌ 2000 చేస్తామని చెప్పి ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారని, 500గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీని విస్మరించారని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రైతులు పండరి, గోవింద్‌, కృష్ణరాజ్‌, రామీరెడ్డి, సుందర్‌ రాజ్‌, సాయిలు, రవి తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు