Friday, May 3, 2024

కొత్త ఉత్సాహం నింపిన చంద్రయాన్‌ – 3 సక్సెస్‌..

తప్పక చదవండి
  • గగన్‌యాన్‌లో ప్రపంచ దేశాలతో ఇస్రో పోటీ..
  • 2025 నాటికి పూర్తి స్థాయిలో ఆస్టోన్రాట్‌ని స్పేస్‌లోకి పంపే లక్ష్యం..
  • స్పేస్ ఇండస్ట్రీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం..
  • కీలక వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో..

బెంగళూరు : ఇప్పటికే చంద్రయాన్‌ – 3 మిషన్‌ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష రంగంలో మిగతా దేశాలకు ఏవిూ తీసిపోమన్న సందేశాన్ని ఇస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పేస్‌ ఇండస్టీక్రి ప్రోత్సాహం అందిస్తోంది. ఫలితంగా..వరుస పెట్టి కీలకమైన ప్రయోగాలను చేపడుతోంది. అందులో భాగంగానే గగన్‌యాన్‌కి శ్రీకారం చుట్టింది. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఓ ఆస్టోన్రాట్‌ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతంగా పూర్తి కావడంతో శాస్త్రవేత్తలత్తో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆస్టోన్రాట్‌లను స్పేస్‌లోకి పంపించడంలో కీలకమైన టెస్ట్‌ చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో…సక్సెస్‌ అయింది. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆస్టోన్రాట్‌లను సురక్షితంగా ల్యాండ్‌ చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ఇది. క్రూ మాడ్యూల్‌ గాల్లో ఉన్నప్పుడు క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ సమయంలో మిషన్ కండీషన్‌ ఏంటో తెలుసుకునేందుకు ఇస్రోకి వీలవుతుంది. క్రూ మాడ్యూల్‌ నుంచి క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ విజయవంతంగా విడిపోతుందా లేదా అన్నది పరీక్షిస్తారు. ప్రస్తుతం చేసింది కూడా అదే. భవిష్యత్‌లోనూ మరిన్ని టెస్ట్‌లు చేసేందుకు ప్లాన్‌ చేసుకుంది ఇస్రో. మిషన్‌ అబార్ట్‌ అయ్యేలా సెట్‌ చేసింది. గగన్‌మిషన్‌తో ద్వారా ఇస్రో ముగ్గురు వ్యోమగాముల్ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 400 కిలోవిూటర్ల ఎత్తులోని ఆర్బిట్‌లోకి ఈ ముగ్గురినీ పంపాలనుకుంటోంది. మూడు రోజుల పాటు ఈ మిషన్‌ కొనసాగు తుంది. ఆ తరవాత వాళ్లను సురక్షితంగా భూమి విూదకి తీసుకురావడంతో ఈ మిషన్‌ పూర్తవుతుంది. బెంగళూరులోని శిక్షణా కేంద్రంలో ఈ ఆస్టోన్రాట్‌కి శిక్షణ అందించనున్నారు. క్లాస్‌రూమ్‌ ట్రైనింగ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌, సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌, పైలెట్ సూట్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. దశల వారీగా ఈ మిషన్‌ని ప్రయోగించనుంది ఇస్రో. ఇప్పటికే తొలి దశ విజయవంతంగా పూర్తయింది. ఈ మిషన్‌ కోసం 90 బిలియన్‌ల ఖర్చు చేయనుంది ఇస్రో. ఇప్పటికే సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా స్పేస్‌లో వ్యోమగాముల్ని పంపాయి. గగన్‌యాన్‌ మిషన్‌ సక్సెస్‌ అయితే…ఈ జాబితాలో భారత్‌ కూడా చేరనుంది. తొలి దశ పూర్తయ్యింది కాబట్టి ఇకపై పూర్తి స్థాయిలో దీన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. వచ్చే ఏడాది ఓ హ్యూమనాయిడ్‌ రోబోని గగన్‌యాన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫిమేల్‌ రోబోకి
యానీపపతి బిసజీ అనే పేరు కూడా పెట్టింది. 2019లోనే ఈ ఫిమేల్‌ హ్యూమనాయిడ్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. తొలిసారి 1984లో భారతీయుడైన రాకేశ్‌ శర్మ రష్యన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అక్కడ దాదాపు 21 రోజుల 40 నిముషాల పాటు ఉన్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు