- బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన వైనం..
చెన్నై : నలుగురు పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వారిని సస్పెండ్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్లింది. మద్యం తాగి ఉన్న నలుగురు పోలీసులు వారిని అడ్డుకున్నారు. బాలిక స్నేహితుడ్ని కొట్టారు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, అనంతరం బాధిత బాలిక ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు పోలీసులను శశికుమార్, శంకరపాండి, ప్రసాద్, సిద్ధార్థ్గా గుర్తించారు. గురువారం వారిని సస్పెండ్ చేయగా తాజాగా ఆ నలుగురు పోలీసులను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.