Monday, May 13, 2024

బీ.ఆర్.ఎస్. నుండి కాంగ్రెస్ లో చేరికలు..

తప్పక చదవండి

మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. అనిరుద్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలు గ్రామాలలోని యువకులు, గ్రామ యూత్ అధ్యక్షుడు బాల్ రాజ్, ముగ్గురు వార్డు సభ్యులు, 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. నవాబ్ పేట్ కేంద్రంలోని ఉమ్మడి గ్రామ పంచాయతీ, గురుకుంట పల్లెగడ్డ గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ యూత్ అధ్యక్షుడు బాల్ రాజ్, పాండయ్య, ముగ్గురు వార్డు సభ్యులు, పోమాల బాల్ రాజ్, వడ్డే దుర్గరాజు, మేకల శ్రీనివాస్ లతో పాటు 50 మంది కార్యకర్తలు.. బుధవారం రోజు టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు