Saturday, May 18, 2024

ప్రతిపక్షాల మాటలను విని మోసపోవద్దు : శంకర్‌నాయక్‌

తప్పక చదవండి

మహబూబాబాద్‌ : కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు కొత్త కొత్త నాయకులు విూ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మొసపోవద్దని గుర్తు చేసారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ అన్నారు. గురువారం గూడూరు మండలం దామరవంచ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 50 కుటుంబాలతో పాటు ఎదామరవంచ ఎంపీటీసీ నునవత్‌ స్వాతి రవి నాయక్‌, కాంగ్రెస్‌ గ్రామ పార్టీ అధ్యక్షులు గాదె వెంకట్‌ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ నునావత్‌ ఈర్యా, గ్రామ మహిళ అధ్యక్షురాలు భూక్య పద్మ, గ్రామ వార్డు సభ్యులు, తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిగా భావించి, భవిష్యత్తులో సముచిత స్థానం గౌరవం ఇస్తానని తెలిపారు. దామరవంచ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చెయ్యాలని సూచించారు, రానున్న 28 రోజుల్లో పార్టీ కోసం కష్టపడండి, వొచ్చే 5 సంవత్సరాలు పార్టీ విూకోసం కష్టపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అరే వీరన్న, రాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు బీరవెళ్లి భరత్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా జడ్పీ కోఆప్షన్‌ ఎండీ ఖాసీం, మండల అధ్యక్ష కార్యదర్శులు, వెంకట్‌ కృష్ణారెడ్డి, నూకల సురేందర్‌, ముక్క లక్ష్మణ్‌ రావు, సంపత్‌ రావు, కోడి రవి, ఉప సర్పంచ్‌ సత్తి రెడ్డి, గాదె నరసింహ రెడ్డి, రాఘవ రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ చేరికలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ తెలిపారు. కాంగ్రెస్‌, బిజెపి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. మహబూబ్‌ నగర్‌ టౌన్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి విజయ్‌ ప్రసాద్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉన్నత 70 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి వల్ల ప్రజలు కనీస వసతులకు కూడా నోచుకోలేదని అన్నారు. రెండు ప్రధాన పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా చేస్తున్నట్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తన కేడర్‌ కు అన్యాయం చేయడం వల్లే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందుకే ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు