Friday, May 17, 2024

కాళేశ్వరం కరెప్షన్‌రావు కేసీఆర్‌

తప్పక చదవండి
  • సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు
  • మేడిగడ్డ పరిస్థితికి సిఎం కెసిఆరే కారణం : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ అంటే కాళేశ్వరం కరెప్షన్‌రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 25వ పిల్లర్‌ నుంచి 1వ పిల్లర్‌ వరకు పూర్తిగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లర్స్‌ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిరదని.. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప ఏంటనేది తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్‌ అండ్‌ టీ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని టీపీసీసీ చీఫ్‌ డిమాండ్‌ చేశారు. సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందన్నారు. గుడినీ గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాపం పండిరది… కేసీఆర్‌ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగిందంటూ విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరయిందన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అవినీతికి ప్రాజెక్టు బలైందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ బలి తీసుకుంటే.. కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుందన్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్‌ఎస్‌కు స్పష్టత వచ్చిందని తెలిపారు. అందుకే కేసీఆర్‌ కేంద్రం సహకారంతో కాంగ్రెస్‌ నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడిరచి తీరుతామని స్పష్టం చేశారు. మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నా అది జరగదన్నారు. తమరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని…. కేసీఆర్‌ను పడగొడుతుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు