Tuesday, May 14, 2024

ట్యాంక్ బండ్ వద్ద దసరా ఉత్సవాలు..

తప్పక చదవండి
  • మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: దసరా ముగింపు ఉత్సవాలకు ట్యాంక్ బండ్ మధ్యన ఉన్న ఐలాండ్ నుశాశ్వత వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరుణంలో సోమవారం నాడు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ బండ్ వద్ద పర్యటించారు. దసరా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి బోటులో చెరువును పరిశీలించారు. అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి ద్వారా ఐలాండ్ కు చేరుకుని అక్కడ శాశ్వతంగా ఉండేలా జమ్మిచెట్టును నాటారు. దసరా కట్టను నిర్మించడంతోపాటు శాశ్వతంగా ఉత్సవాలు, బాణాసంచా కార్యక్రమం అక్కడే కొనసాగుతుందన్నారు.

దసరా ఉత్సవ కమిటీ సూచనల మేరకు ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ట్యాంక్ బండ్ వద్ద స్వరలహరి కల్చరల్ అకాడమీ, దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాలతో పలు సాంస్కృతిక సంస్థల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రకాష్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు చెరుకుపల్లి రాజేశ్వర్, సుదీప్ రెడ్డి ,రామకృష్ణ, పరమేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు