- మరో మహమ్మారి దాడిచేయనుందా..?
- వివరాలు సినికా జర్నల్ లో ప్రచురించిన సైంటిస్ట్స్..
బీజింగ్ : కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ మాయదారి వైరస్ యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాజం మొత్తం స్థంభించిపోయింది. అన్ని రంగాలపై ప్రభావం చూపిన కోవిడ్19 వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చిన విషయం ప్రపంచానికి తెలిసిందే. అయితే తాజాగా ఓ వార్త మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు హైనాన్లో ఎనిమిది కొత్త వైరస్లను గుర్తించారు. ఇప్పుడీ వార్త అలజడి రేపుతోంది. అయితే ఈ వైరస్ జాతులను ఆపకపోతే మనుషులకు సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు చైనా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ అధ్యయనంలో తేలిన వివరాలను శాస్త్రవేత్తలు వైరోలాజిక సినికా అనే జర్నలో ప్రచురించారు. ఎలుకల నుంచి సేకరించిన షాంపిల్స్లో శాస్త్రవేత్తలు ఈ వైరస్లను గుర్తించారు. ఇందులో బాగంగా శాస్త్రవేత్తలు 2017 నుంచి 2021 మధ్య హైనాన్లో ఉన్న ఎలుకల నుంచి 682కిపైగా గొంతు నమూనాలను సేకరించి ల్యాబ్లో పరీక్షించారు. ఈ పరీక్షల్లో కొత్తగా 8 వైరస్ల ఉనికి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో బీటా కోరోనావైరస్ అనే కరోనావైరస్ కుటుంబానికి చెందిన వైరస్ ఉండడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఈ ఎలుకల్లో కరనో వైరస్లు, ఫ్లేవి వైర్లు, పార్వో వైరస్లు, ఆస్ట్రో వైరస్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక జాండిల్స్, డెంగ్యూకి కారణమయ్యే కొత్త ఫ్లేవి వైరస్లు కూడా ఎలుకల్లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.