Monday, May 13, 2024

మరో సింహం మృతి

తప్పక చదవండి
  • తిరుపతి ఎస్వీ జూలో మరో సింహం మృతి
  • వృద్ధాప్యం కారణంగా చనిపోయినట్లు చెప్పారు
  • నాలుగు రోజుల క్రితమే మరో సింహం మృతి

తిరుపతి : తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్దాప్యం కారణంగా మృతి చెందినట్లు క్యూరేటర్‌ సెల్వం వెల్లడిరచారు. ఇటీవల జన్యు సంబంధిత కారణాలతో అనురాగ్‌ అనే సింహం మృతి చెందిన విషయం తెలిసిందే. సింహాల వరుస మరణాల నేపథ్యంలో జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ఆదివారం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్‌ అనే మగ సింహం (7) మృతి చెందింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్‌ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ 3 సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్‌ అనే పెట్టారు. ఇది పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వయసుకు తగ్గ బరువు, పొడవు లేకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల దాన్ని ప్రదర్శనకు ఉంచలేదని జూ అధికారులు పేర్కొన్నారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు. సాధారణంగా సింహాలు 15`20 ఏళ్లు జీవిస్తాయని అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు