Wednesday, May 8, 2024

చరిత్రలోకి తీసుకెళ్ళే ఆత్మకథ ‘నా జీవన యానం’

తప్పక చదవండి

ఏ ఒక్కరి ప్రయాణం ఒంటరిగా సాగదు. వారి అడుగుజాడల్లో కాలం, సమకాలీన సమాజం పాదల్లో రేఖలుగా ముద్రితమై వుంటాయి. దీనికి జీవితచరిత్రలు, ఆత్మకథలు ఉదాహరణ రూపాలు. ఎత్తుపల్లాలు చూసిన ఆత్మకథలైతే సాహిత్యంతో పాటు చరిత్రకి కూడా ఎంతో ఉపయోగం. అటువంటి ఆత్మకథల కోవకు చెందినదే అల్లూరి సోమరాజు రాసుకొన్న ‘నా జీవన యానం’. కలిగినోళ్ళ ఇంట్లో పుట్టినా ఊహ తెలిసేపాటికి పరిస్థి తులు ‘నిలువుదోపిడీ’ చేసి రోడ్డుమీద నిలబెట్టేశాయి. ‘శ్రద్ధగా చదువుకో! కష్టపడి చదువుకో! చదువే మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దేది! ఈవిషయం నీ జీవితాంతం గుర్తుంచుకో’ అని బోధించిన తండ్రి వాక్యం వేదంలా భావించి కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా కష్టపడి ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ అయ్యి సొంతంగా ఒక హాస్పిటల్‌ స్థాపించి పిల్లలను కూడా అదే బాటలో నడిపి ఉమ్మడి కుటుంబానికి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి తండ్రి స్థానాన్ని బాధ్యతగా భర్తీ చేసిన డెబ్బైఐదేళ్ళ సోమరాజు అనే వ్యక్తి జీవిత ప్రయాణమే ఈ ‘నా జీవన యానం’(ఆత్మకథ). సోమరాజు గారి ఆత్మకథలో ఎక్కువ భాగం తండ్రి అల్లూరి సత్యనారాయణరాజు చుట్టూ తిరుగు తుంది. సత్యానారాయణగారు స్వాతంత్య్ర, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరు. ఈయన నిస్వార్థ రాజకీయం ఎలాంటిదంటే ‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటి ముందు ఎప్పుడూ ఎద్దుల బళ్ళు ఆగివుండేవి. నాన్నగారు ఓపిగ్గా వచ్చినవారి సమస్యలు విని తగు సహాయం చేసేవారు. వారికి భోజనాలు కూడా మా ఇంట్లోనే! రోజుకు కనీసం నలభై యాభై మందికి భోజనం! మా నాన్నగారికి ఎమ్మె ల్యేగా వచ్చే చేసిన జీతం తప్ప ఏ ఆదాయం లేద’’న్న (పుట:9) వాక్యాలు నాటి రాజకీయ నాయకుల నిస్వార్థతకు సాక్ష్యాలు. ఇవే కాక చల్లపల్లి జమీందారు జగన్నాథరావు పేదలకు సంబంధించిన 7,500 ఎకరాలు స్వాధీనం చేసుకొంటే తిరిగి రైతులకు ఇప్పించడానికి జైలుకెళ్ళడం, బ్రిటీషువారు కమ్యునిస్టు నాయ కుడైన పరకాల శేషావతారంగారిని (పరకాల ప్రభాకర్‌ తండ్రి) కాల్చివేత ఉత్తర్వులను ధిక్కరించి మరి ఆయనను కాపాడడం, చల్లపల్లి జమీందారుపై సామాన్యుడైన మండలి వెంకట కృష్ణారావును (మండలి బుద్ధ ప్రసాద్‌ తండ్రి) నిలబెట్టి మచిలీ పట్నం నుంచి గెలిపించడం(1957), అయన పిల్లలకు స్వాత్రం త్య సమరయో ధుల పేర్లు(సుభాస్‌ చంద్రబోస్‌, జితేంద్రనాథ్‌, రaాన్సీ, విజయ కుమారి) పెట్టడం వంటి విషయాలు ఆయనలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటులో కీలకమైన పెద్ద మనుషుల ఒప్పందంలో సత్యనారా యణ రాజుగారు ఒకరు. ఈ ఆత్మకథలో తండ్రి గురించి ఎక్కువగా చెప్పడానికి అయనది ప్రజాజీవితం అన్న కారణంతో పాటు రచ యితపై చూపిన ప్రభావము, ప్రేమ కూడా కారణమే. సోమరాజు చదువు కొనసాగుతున్నప్పుడే తండ్రి మరణం కుటుంబ ‘కేంద్రాన్ని’ దెబ్బతీసింది. నిస్వార్థ రాజకీయాల ద్వారా ఉన్నదీ నిలబెట్టుకోకపొగ పోగొట్టుకోవడం జరిగడంతో సామాన్యుల కుటుంబంలా ఇబ్బందులు ఎదుర్కోవలసివచ్చి పక్క రాష్ట్రంలోకి వలస పోవలసివచ్చింది.సోమరాజు చదువుకొన్న డాక్టర్‌ వృత్తి ద్వార గంగావతిలో(కర్ణాటక) చిన్న క్లినిక్‌ పెట్టి చిత్తశుద్ధి, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడుతు ఒక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేతగా ఎదిగారు. తన పిల్లలను కూడా అదే వృత్తిలోకి తీసు కొచ్చి మరింత ప్రజాసేవను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలా అన్నదమ్ములతో కలిసిఒక్కొక్క పరిస్థితిని చక్కబెట్టుకొన్నారు. సోమరాజు వివాహమాడిన శంకరకుమారి అనెగొంది సంస్థాన వంశీయులైన అమ్మాయి కావడం ఓ విశేషం. సోమరాజు వైద్యం ద్వారానే కాకుండా సాహిత్య పోషణ, పేద విద్యార్థులకు ప్రోత్సా హం, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ, లయన్‌ క్లబ్స్‌ ఏర్పాటు, ఆరోగ్య సదుపాయాల కల్పన, గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ, స్వాత్రంత్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు… మొదలైన సేవలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి.తండ్రి వారసత్వ ప్రజాసేవను మరోరూపం ద్వార కొనసాగించడంగానే భావించవచ్చు. సాగుతున్న కాలం చరిత్రకు పురుడు పోస్తూ ఉంటుంది. ఈ ఆత్మకథలో అలనాటి స్వాత్రంత్య పోరాటపు అనిచివేతలు, అంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన సామాజిక పరిస్థితులు, పెద్దమనుషుల ఒప్పందం, ముఖ్య మంత్రి కావడంలో ఉండే లాబీయింగ్‌ విధానాలు, తొలిదళిత ముఖ్య మంత్రి దామోదర సంజీవయ్యని పదవీత్యు చుడిని చెయ్యడంలో జరిగిన హస్తిన చదరంగం, కొందరి నిస్వార్థ రాజకీయ త్యాగాలు… మొదలైన అంశాలు వెనకటి 50 ఏళ్ళ తెలుగు రాజకీయ చరిత్రలోకి తీసుకెళ్తాయి. ఈ ఆత్మకథలో చివరిలోని విదేశీ, స్వదేశీ యాత్రలంటూ సాగే రెండు అధ్యాయాలు మనల్ని గ్లోబ్‌ ని తిప్పి చూపించినట్టు పేజీల మధ్య ప్రపంచాన్ని పరిచయం చేయిస్తాయి. అలాగే అనుబంధంగా సాగే ‘యువతకు సూచనలు’లో ‘క్లాసు పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవాలి… ఎప్పుడూ పుస్తకాల పురుగు కారాదు గ్రౌండ్‌ లోకి కూడా దిగాలి… దినపత్రికలు విషయ పరిజ్ఞానం పెంచుతాయి… సొంత ఆదాయం ఉంటేనే సంసారం బడి ఆర్థిక ఇబందుల్లో ఇరుక్కోదు. ఏపెళ్ళైనా అభిరుచులు కలిస్తేనే హాయిగా సాగు తుంది’ (పుట:168)అన్న వాక్యాలు ‘పడిలేచిన 75 ఏళ్ళ వ్యక్తి జీవితానుభవం’గా చెబితే తప్పక యువపాఠకులకు వాస్తవి కతపై దృష్టి సారించేలా దోహదం చేస్తుంది. తాతల అనుభవా లకు, తండ్రి విలువైన నిర్ణయాలకు దూరంగా ఉంటున్న సమా జం నాటినాటికి విస్తరిస్తున్న తరుణంలో ఆ లోటును, ఆ బాధ్యత ను నాణ్యతగల ఆత్మకథలే తీర్చగలవు. ఆ కోవకు చెంది నదే. ఈ ఆత్మకథ. ఈ ‘జీవనయానం’లో సుమారు పావుశాతం చిత్రాలు ఉండడం తప్ప మిగిలిన అన్ని విషయాలు పాఠకులకు కేటాయిం చిన సమయానికి సంతృప్తికరమైన ప్రతిఫలమే దక్కుతుంది. ఈ ఆత్మకథ సోమరాజు ‘బతుకు’ భావాల్ని పాఠ కులకు అం దించడంలో అజీజ్‌ది (కర్నూలు) విలువైన ఉడత సహ కారం. ఒకరకంగా చెప్పాలంటే పాఠకులకు ఒక పెద్దా యనతో ‘బతుకు గురించి మాట్లాడుతూ బువ్వ తింటున్నట్టే’ ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు