- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్ : నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారు లను ఆదేశించారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జీఎచ్ఏంసి,వాటర్ వర్క్స్ తదితర శాఖలకు చెందిన అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసు కున్నారు. వాటర్ వర్క్స్, జీఎచ్ఏంసి అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీ, రామస్వామి కాంపౌండ్, సజన్ లాల్ స్ట్రీట్ తదితర ప్రాంతాలలో సీవరేజ్, వాటర్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదని, మరికొన్ని చోట్ల ఈ పనులు పూర్తికాకపోవడం వలన రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. పెండిరగ్ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, పుట్ పాత్ ల నిర్మాణ పనులను కూడా పూర్తిచేసి ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని అన్నారు. బేగంపేట లోని ఓల్డ్ కష్టమ్ బస్తీలో చేపట్టిన ముస్లీం గ్రేవ్ యార్డ్ నిర్మాణ పనులను కూడా మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా మంజూరైన పనుల కు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జీఎచ్ఏంసి ఈ ఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ సి జి ఎమ్ ప్రభు, డి జీ ఎమ్ శశాంక్, సురేష్, సంద్యారాణి, డిఈ బ్రహ్మరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసిపి క్రిస్టోఫర్, డిప్యూటీ ఈ ఈ ఆంజనేయులు, ఏఈలు నవీన్, ఎలెక్ట్రికల్ డి ఈ శ్రీధర్, స్ట్రీట్ లైట్స్ డిఇ ప్రసన్న, శానిటేషన్ డిఇ శ్రీనివాస్, ఏ ఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.