Monday, April 29, 2024

బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

తప్పక చదవండి
  • కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన యువకుడు

జహీరాబాద్‌ : కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అర్జున్‌ నాయక్‌ తండాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..తండాకు చెందిన రాథోడ్‌ సందీప్‌ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.
దీంతో మనస్థాపం చెందిన సందీప్‌ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తండా వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఒక బాబు, పాప ఉన్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబా సభ్యుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్‌ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు