Sunday, May 19, 2024

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అరుదైన సమతుల్యత

తప్పక చదవండి
  • దేశంలోనే మోడల్‌ తెలంగాణగా రాష్ట్రం పరుగులు
  • మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి
  • వాటిని పటాపంచాలు చేసిన ధీటైన నాయకుడు కేసీఆర్‌
  • తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ మోడల్‌ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కేసీఆర్‌ సర్కార్‌లో అరుదైన సమతుల్యత కనబడుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు.. ఆర్థిక పరిస్థితి ఏందో అని కొన్ని వర్గాల్లో ఆందోళన ఉండేది. అపోహాలు, అనుమానాలు, ఉండేవి. నాటి పరిస్థితి, నేటి పరిస్థితి ఎలా ఉందో విూ అందరూ చూస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం ఎలా మారిందో విూ అందరికీ తెలుసు. కరెంట్‌, సాగు,తాగు నీటి పరిస్థితులును గుర్తు చేసుకోండి. ఈ మూడిరటిని అధిగమించాం. వైద్యం, విద్యాసంస్థలు ఇలా చెబుతూ పోతే.. ప్రతి రంగంలో గణనీయమైన గుణాత్మకమైన మార్పు వచ్చింది. మన తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డప్పుడు లక్షా 14 వేలు ఉండే. ఇప్పుడు 3 లక్షల 17 వేలకు చేరింది. విూకు పరిపాలన చేయడం వచ్చా..? అని వెక్కరించిన వారికి కంగు తినిపిస్తూ మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే ప్రకటించిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సవిూకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్‌. పదాలు బాగున్నాయిని వాడటం లేదు. తెలంగాణలో జరుగుతున్న సమతుల్య మోడల్‌ ఎక్కడా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఇమేజ్‌ ఉండేది. ప్రో బిజినెస్‌, ప్రో ఐటీ, ప్రో అర్బన్‌ ఇమేజ్‌ ఉండేది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఒక ఇమేజ్‌ కోసం తాపత్రయ పడ్డారు. ప్రో పూర్‌, ప్రో రూరల్‌, ప్రో అగ్రికల్చర్‌ అన్నారు. కానీ ఇవాళ కేసీఆర్‌ సర్కార్‌లో అరుదైన సమతుల్యత కనబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. మూడున్నర కోట్ల మెట్రిక్‌ టన్నులకు పండిరచే స్థాయికి ఎదిగాం. అన్నపూర్ణగా మారింది తెలంగాణ. 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉండే. అక్కడి నుంచి 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగింది. హైదరాబాద్‌, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించాం. ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణలో 10 లక్షలకు చేరుకుంది. ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఐటీని అభివృద్ధి చేశాం. పరిశ్రమలు పెరుగుతున్నాయి. పర్యావరణం పెరుగుతుంది. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్‌ కవర్‌ను పెంచాం. గ్రీన్‌ బడ్జెట్‌ పెట్టి, చట్టాలు చేసి చెట్లు కాపాడాలని ఆదేశించాం. ఉద్యోగాలు పోతాయని హెచ్చరించాం. భవిష్యత్‌ తరాల కోసం హరితాన్ని పెంచే ప్రయత్నం చేశాం. పర్యావరణహితంగా ఉండే పరిశ్రమలను ఎంకరేజ్‌ చేశాం. 24 వేల పరిశ్రమలు వచ్చాయి. లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఆ విధంగా రూరల్‌ డెలవప్‌మెంట్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వ్యవసాయం, ఐటీ, వెల్ఫేర్‌.. ఈ అరుదైన సమతుల్యత కనబడేది మన తెలంగాణలోనే మాత్రమే అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
ఫాక్స్‌కాన్‌ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్‌ కుట్ర
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్‌ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఫాక్స్‌కాన్‌ కంపెనీకి లేఖ రాయడంపై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఆపిల్‌ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తోంది. చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. మనం కష్టపడి నాలుగేండ్లు వెంబడి పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నాం. వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్‌లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి ఫ్యాక్టరీ పెడుతాం అని ప్రకటించారు. ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదురుగా కొంగరకొలాన్‌లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంతస్తులు పూర్తయ్యాయి. వచ్చే ఏప్రిల్‌, మే నెలలో ఫాక్స్‌ కాన్‌ కంపెనీ ప్రారంభం కానుంది అని కేటీఆర్‌ తెలిపారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఫాక్స్‌కాన్‌ కంపెనీకి అక్టోబర్‌ 25న లేఖ రాశారు. ఆపిల్‌ ఎయిర్‌ పొడ్స్‌ ఇండస్ట్రీని హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మార్చండి. తొందరల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతోంది. హైదరాబాద్‌ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తాం. ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తుంది అని డీకే శివకుమార్‌ తన లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు. అంటే కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతది అనే దానికి ఇది ఒక చిన్న ఉదహరణ. ఢల్లీి చేతిలో మన జుట్టు ఇస్తే, కొట్లాడే మొనగాడు, తెలంగాణ ప్రజయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే పరిస్థితి ఇలానే తయారవుతుంది. కాంగ్రెస్‌కు బెంగళూరు అడ్డా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్‌ టికెట్లు ఢల్లీిలో కాకుండా, బెంగళూరులో కూడా డిసైడ్‌ అవుతున్నాయి. పైసలన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. సిద్ధారమయ్య, డీకే శివకుమార్‌ కష్టపడి సంపాదించిన పైసలు తెలంగాణకు తరలుతున్నాయి. అడ్డంగా దొరికిపోతున్నాయి. అధికారం కాంగ్రెస్‌ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్‌ పరిశ్రమను బంద్‌ చేసి బెంగళూరుకు తరలిస్తారు అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు