Friday, May 3, 2024

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి

తప్పక చదవండి
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
    హైదరాబాద్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించా లంటూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపది కన పనిచేస్తున్న టీచింగ్‌ మరియు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఆది వారం హైదరాబాద్‌కు వచ్చి ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కుట్రల నుంచి సింగరేణిని సీఎం కేసీఆర్‌ తప్పించారని అన్నారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి సింగరేణి సంస్థను కాపాడారని తెలిపారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను రాష్ట్ర విభజన అనంతరం సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని అన్నారు. అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని వివరించారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్‌ వారసత్వం ఉద్యోగాలను కల్పించారని చెప్పారు. అదే రకంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్‌ మరియు నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌ తో చర్చిస్తానని అన్నారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు