న్యూఢిల్లీ : దీపావళి పండగకు ముందు కిలో గోధుమ పిండి రూ.27.50కే అందించే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ పేరుతో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సంస్థలకు చెందిన 800 మొబైల్ వ్యానులు, 2 వేల విక్రయ కేంద్రాల ద్వారా ఈ గోధుమ పిండి విక్రయాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో.. 100 ‘భారత్ ఆటా’ మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు.