- మహిళను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకుడు
- నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం
హైదరాబాద్లోని తార్నాకలో దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన ఏసు (32) మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి అతను బైక్పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా.. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమె వద్దకు వెళ్లిన ప్రశాంత్ లాలాపేటలో బైక్పై డ్రాప్ చేస్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన మహిళ బైక్ ఎక్కి కూర్చుంది. అనంతరం ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతని స్నేహితులు మధుయాదవ్ (31), రోహిత్ (19), ప్రశాంత్ (20), తరుణ్ (20) లను అక్కడికి పిలిచి ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు లాలపేట పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.