Friday, May 17, 2024

యువతకు ఉపాధి ఇచ్చాం.. యువసారధ్యానికి అవకాశం ఇస్తాం..

తప్పక చదవండి
  • కారుణ్యనియామకాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌దే
  • ఎమ్మెల్సీ కవితతో టీబీజీకెఎస్‌ నేతల భేటి
  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి సంస్థలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకెఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్యలు బుధవారం హైద్రాబాద్‌లో ఆమెఉ కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు.ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో 50శాతం ఉన్నారు కాబట్టి తమ యూని యన్‌లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవ కాశాలు కల్పిస్తామన్నారు.1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కెసిఆర్‌ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారన్నారు. కోల్‌ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని స్పష్టంచేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంద న్నారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజికెఎస్‌ను గెలిపించు కుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుదన్నారు. కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజికె ఎస్‌ అని తేల్చిచెప్పారు.కార్మికుల తల్లిదండ్రులకు కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, క్వార్టర్స్‌లో నివసించే వారు బేసిక్‌లో 1శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధన ను కెసిఆర్‌ రద్దుచేశారని, డిపెండెంట్‌ ఉద్యోగం వద్దనుకుంటే ఆకుటుంబానికి రూ.25లక్షలు చెల్లించా లని నిర్ణయం, కార్మికుల మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వేతన రక్షణ కల్పించడం సొంత ఇల్లు నిర్మించు కునే వారికి రూ.10లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం కార్మికులపిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కెసిఆర్‌ తీసుకున్నారని కవిత తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు