Friday, May 3, 2024

జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

తప్పక చదవండి

హైదరాబాద్ : నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… నగరంలో చేపట్టిన జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోమాజిగూడ జంక్షన్ పనులు పూర్తయ్యాయని అన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రానైట్ పేవ్ మెంట్, కబుల్ ఫ్లోరింగ్, యూనిఫాం ఫుట్ పాత్, గ్రీనరి, ల్యాండ్ స్కేపింగ్, లైటింగ్ పనులు పూర్తి అయ్యాయని, పంజాగుట్ట జంక్షన్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ పనులను పరిశీలించారు. ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద చేపట్టే జంక్షన్ అభివృద్ధి పనులను ట్రాఫిక్ పోలీసుల సలహాలతో పనులను పూర్తి చేయాలని . ఇందులో భాగంగా ఫ్లైఓవర్ కింద ఫుట్ పాత్, సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులను చేపట్టాలని తెలిపారు. అనంతరం కేబీఆర్ పార్కును పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ తిరిగి పార్కులో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి వాకర్స్ తో అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్ పున:నిర్మాణం, ప్లాంటేషన్, ల్యాండ్ స్కేపింగ్, టాయిలెట్స్ నిర్మాణాలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పూల మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖైరాతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రె, అడిషనల్ కమిషనర్ యు.బి.డి కృష్ణ, ఎస్.ఇ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు