Thursday, May 16, 2024

తెలంగాణలో ట్రాన్స్‌ఫర్స్‌

తప్పక చదవండి
  • ఆరుగురు ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ బదిలీ..
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ శాంతికుమారి
  • రంగారెడ్డి కలెక్టర్‌ భారతి హోలికెరిపై వేటు

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారీగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఆరుగురు ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌ పై బదిలీ వేటు పడిరది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న భారతి హోలికేరిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌ ఫోర్ట్‌ కమిషనర్‌ గా జ్యోతి బుద్ధా ప్రకాష్‌, ఏక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ కమిషనర్‌ గా శ్రీధర్‌, రంగారెడ్డి కలెక్టర్‌ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు పడిరది. రంగారెడ్డి కలెక్టర్‌ గా గౌతమ్‌ పోర్ట్‌ ను నియమించారు. ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌ గా శృతి ఓజా, ట్రైబల్‌ ఫెల్ఫెర్‌ డైరెక్టర్‌ గా నర్సింహా రెడ్డి, సివిల్‌ సప్లై కమిషనర్‌ గా దేవేంద్ర సింగ్‌ చౌహన్‌ లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు