Thursday, May 16, 2024

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌ రెడ్డికిఅభినందనలు తెలియజేసిన టీఎన్జీవోలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏనుముల రేవంత్‌ రెడ్డి ఈరోజు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు డా.యస్‌.ఏం.హుస్సేని (ముజీబ్‌), కేంద్ర సంఘ నాయకులు టి.పర్వతాలు కలిసి అభినందనలు తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, జూపల్లి కృష్ణారావులను కలిసి అభినందనలు తెలిపారు. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్సోర్షింగ్‌ ఉద్యోగుల కుటుంబాల తరుపున శుభాకాంక్షలు తెయిజేస్తున్నాం, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్‌ తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము.ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టోలో చేర్చినందున ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడిరది కనుక ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ తెలియజేశారు.ఈ శుభ సందర్భంలో టీఎన్జీయూస్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు డా.యస్‌.ఏం.హుస్సేని (ముజీబ్‌) ఆధ్వర్యంలో గృహకల్ప కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌,కస్తూరి వెంకటేశ్వలు, కొండల్‌ రెడ్డి, ఉమాదేవి, జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు కే.ఆర్‌.రాజ్‌ కుమార్‌, కోశాధికారి బాలరాజ్‌, సభ్యులు కురాడి శ్రీనివాస్‌, ఖాలీద్‌ అహ్మద్‌,వైదీక్‌ శాస్త్ర, బొలిగిద్ద శంకర్‌, శ్రీధర్‌, ముఖీం ఖురేషి, వహీద్‌ మరియు ఇతర యూనిట్‌ అధ్యక్ష కార్యదర్శులు సమక్షంలో భారీ కేక్‌ కటింగ్‌ మరియు టపాకాయలు పేల్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు