Wednesday, May 1, 2024

నీలం మధు కు జననీరాజనం

తప్పక చదవండి
  • నీలం మధు కి స్వాగతం పలికిన యువత
  • పటాన్ చేరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ
  • ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మనదే
  • పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు…
  • ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా..
  • బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌…

పటాన్చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి యువత ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాక్స్ సొసైటీ, న్యూ ఎంఐజి, ఎల్ఐజి, అన్నమయ్య ఎంక్లేవ్ లో రోడ్డుషో, భారీ బైక్ ర్యాలీ తో నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. ఇంత భారీగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు.. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్ని గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరూ నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నీలం మధు గెలిస్తే మీ ఇంటి బిడ్డ గెలిచినట్టేనన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు మన ఆత్మగౌరవ పోరాటాన్ని అవహేళన చేసేలా ప్రవర్తించాయని విమర్శించారు. బడుగుల జీవితాల్లో వెలుగులని నింపుతూ మన బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. మనల్ని కొందరు నాయకులు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తూ మన ఆత్మ గౌరవాన్ని నోట్ల కట్టాలతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నోట్లతో మా బహుజన సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మనం ఒక్కటిగా పోరాడి చట్ట సభల్లో ప్రవేశిస్తే మనలో నుంచి చాలా మంది మన ప్రాంతాలలో అన్ని స్థాయిల్లో మన బహుజన బిడ్డలు నాయకులుగా ఎదిగే అవకాశం లభిస్తుందని తెలిపారు. మనం ఎదిగితే మన ప్రాంతల్ని మనమే అన్ని రంగాల్లో ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. మన అభివృద్ధి కోసం ఒక్క సారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన క్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్దికి పని చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, నీలం మధు గారి అభిమానులలు భారీ ఎత్తున పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు