బీజింగ్ : ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభు త్వం ఆమోదం తెలిపింది. ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ఎహంగ్ అనే చైనా కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసింది. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తు న్నట్టు ఆ కంపెనీ తెలిపింది. కంపెనీ సీఈవో హుయాజీ హు మాట్లాడుతూ రానున్న అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలు అనేక నగరాల్లో కనిపించనున్నాయని చెప్పారు. తమ కంపెనీకి ఇప్పటికే 1200 ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.