Saturday, May 4, 2024

5 రోజులే గడువు

తప్పక చదవండి
  • పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం
  • ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు
  • 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా…

న్యూఢిల్లీ : రూ.2వేల కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి గానీ సెప్టెంబర్‌ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్‌ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. ఈ క్రమంలోనే ఎవరైన తమ వద్ద ఇంకా రూ.2వేల నోట్లు ఉంటే మార్చుకుంటే బెటర్‌. కాగా, ఈ నోట్ల మార్చుకునేందుకు 5 రోజులే సమయం ఉండగా.. అందులో ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది. సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకూ (సోమవారం నుంచి బుధవారం) బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. అనంతరం 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నాలుగు రోజుల్లోనే విూ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. అందుకని వినియోగదారులు బ్యాంకు పనివేళలను తెలుసుకొని 2వేల రూపాయల నోట్లతో వెళ్తే మంచిది. మరోవైపు పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు చివర్లో సెలవుల నేపథ్యంలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఇంకో రెండువారాల గడువు ఇచ్చే అవకావం ఉందని అంచాన వేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్‌ చేయడానికి లేదా వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్‌ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను ఇప్పటికే మార్చుకున్నారు. బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, సెప్టెంబరు 1 నాటికే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఆర్‌బీఐ వద్దకు చేరాయి. దీంతో దేశంలో చలామణిలోకి పంపిన రూ.2వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేసినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే వెల్లడిరచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు