ముంబై : సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26 నుంచి దక్షిణాఫ్రికా
భారత్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ సిరీస్కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్కప్ తర్వాత ఈ సీనియర్ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ’విరోహిత్’ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రోటీస్ సిరీస్లో విరాట్, రోహిత్ పరుగులు పరుగుల వరద పారిస్తారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం జట్టులో విరాట్, రోహిత్ శర్మ చాలా అనుభవజ్ఞులైన బ్యాటర్లు. వారిద్దరికి దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఈ టెస్టు సిరీస్లో వారిద్దరూ భారీగా పరుగులు సాధిస్తారని నేను భావిస్తున్నాను. ఈసారి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్ కొంచెం వీక్గా ఉంది. ఈ సిరీస్కు సీనియర్ పేసర్లు నోర్జే, లుంగి ఎంగిడీ దూరమయ్యారు. రబాడ అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే అవకాశముందని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
తప్పక చదవండి
-Advertisement-