Thursday, May 16, 2024

ఉత్తరాది గోముద్రకు సంకేతం

తప్పక చదవండి
  • ఉత్తర, దక్షణం అంటూ విభేదాలు సరికాదు..
  • సెంథిల్‌ వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టిన తమిళసై

అహ్మాదాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రకు సంకేతమని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. అహ్మాదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీలో జరిగిన కల్చరల్‌ ఎకానవిూ కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోక్‌సభలో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచినట్లు ఆయన ఆరోపించారు. ఎంపీ సెంథిల్‌ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని గవర్నర్‌ తమిళసై అన్నారు. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అని, కొందరు ఉత్తరదక్షిణ రాష్ట్రాల మధ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ ఆ వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు పవిత్రకు సంకేతమైన గోముద్ర రాష్టాల్రు అని, అవి గోమూత్ర రాష్ట్రాలు కాదు అని ఆమె అన్నారు. ఇలాంటి విభజన ఉండవద్దు అన్నారు.

పురాతన కాలంలో తమిళ ప్రజలు తమ ఇండ్లల్లో దేవుడి ముందు హూండిని పెట్టుకుని దాంట్లో రోజు డబ్బులు వేసేవాళ్లు అని, జమ అయిన ఆ సొమ్ముతో కాశీ యాత్ర చేసేవాళ్లు అని గవర్నర్‌ తమిళసై తెలిపారు. దేశ ప్రజలు ఆధ్మాత్మికంగా ఒక్కటై ఉన్నారని, కానీ ప్రాంతీయంగా వాళ్లను వేరు చేయడం సరికాదు అని అన్నారు. ప్రజల్ని ఎలా విభజిస్తారని, ఆధ్యాత్మికంగా ఒక్కటయ్యారని, రాజకీయంగా కొందరు విభజన చేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వాళ్లు ప్రయత్నాలు ఏవిూ ఫలించవని, ఎందుకంటే అందరూ ఆధ్యాత్మికంగా ఒక్కటై ఉన్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడులో కాశీ, రామేశ్వరంను ప్రజలు వేరువేరుగా చూడరని, కాశీ వెళ్లిన వారు రామేశ్వరం వెళ్తారని, అలాగే రామేశ్వరం వెళ్లిన వాళ్లు.. కాశీకి ఆధ్యాత్మిక టూర్‌ చేస్తారని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఉత్తరాదిదక్షిణాది మధ్య అగాధాన్ని పెంచవద్దు అని, కాశీ పట్టణం ఉత్తరంలో ఉందని, తమిళనాడులో టెన్‌కాశీ ఉందన్నారు. మన సంస్కృతులు ఒక్కటి కావడం వల్ల.. మనల్ని ఎవరూ విడదీయలేరని ఆమె తెలిపారు. బలమైన సాంస్కృతిక వ్యవస్థ అవసరమని చెబుతూ.. గడిచిన 100 ఏండ్లలో దేశవ్యాప్తంగా సుమారు 20 వేల ఆలయాలు ధ్వంసం అయ్యాయని, ఇప్పుడు అలాంటి ఆరాధ్య కేంద్రాలను డెవలప్‌ చేస్తున్నట్లు చెప్పారు. గుజరాత్‌లోని పావగద్‌ కొండల్లో ఉన్న శ్రీ కాళికామాత ఆలయాన్ని ఇటీవల పునర్‌ నిర్మించినట్లు ఆమె తెలిపారు. ఆలయాల పునర్‌ నిర్మాణం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఆలయాన్ని ఓసారి రెనోవేట్‌ చేస్తే, అప్పుడు అక్కడికి భక్తులు వస్తారని, ఆలయాల పునర్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, కాళీమాత ఆలయాన్ని పునర్‌ నిర్మించడానికి ముందు రోజూ 5వేల మంది భక్తులు అక్కడికి వచ్చేవారని, ఇప్పుడు ప్రతి రోజూ 80 వేల మంది వస్తున్నట్లు ఆమె తెలిపారు. కిసాన్‌ కార్డుల తరహాలో యాత్రకుల కార్డులు ఇవ్వాలని, దాని వల్ల హోటళ్లలో లేదా పూజా ప్రదేశాల్లో ప్రిఫరెన్స్‌ వచ్చేలా చూడాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు